Saturday, October 20, 2018

హిందు అనే పదం మన ధర్మానికి ఎలా వచ్చింది?

చాలా మందికి హిందు అనే పదం మన ధర్మానికి ఎలా వచ్చింది అనేది తెలియని వారు చాలమంది ఉన్నారు.. క్రైస్తవులు ఇది ఎదో జికే క్వశ్చన్ ల మన హిందువులను అడుగుతుంటారు అలాంటివ్వారందరి కోసం ఈ పోస్టు.....
హిందూ ధర్మం (Hinduism orHindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ మతం అతి పురాతన మతం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మనామముతో వ్యవహరింపబడినదో, అదియే ఇపుడుమత మను పేరుతో వాడబడుచున్నది.ధర్మము అనగా ఆచరణీయ కార్యము.మత మనగా అభిప్రాయము . హిందూ అనే పదమును ఫార్సీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి ఫార్సీ భాషలో సింధు అని అర్థము,#సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలచేవారు కాని ఇప్పుడు వేదాలు మరియు వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు. హిందూమతం మరియు దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి.ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన #హిందూధర్మాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.

ఇస్లాం, మరియు క్రైస్తవం, తరువాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం మరియు నేపాల్ లోనే నివసిస్తున్నారు. ఇంకా హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్,శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్,_మారిషస్, ఫిజి, సూరినాం, గయానా, ట్రినిడాడ్మరియు టుబాగో, అమెరికా, రష్యా మరియు చైనాముఖ్యమైనవి
హిందువుల వేద సంపద చాలా అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు,మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు మరియు ఉపనిషత్తులుఅతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు,పురాణాలు మరియు మహా కావ్యాలైనటువంటిరామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు భగవద్గీత అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.
క్రొత్త రాతియుగం నుండి హరప్పా మొహంజొదారో నాగరికత కాలం వరకు హిందూమతం గురించిన పురాతన ఆధారాలు ఉన్నాయి.(5500–2600BCE)(1500–500BCE) కాలానికి చెందిన అంశాలను 'చారిత్రిక వైదిక ధర్మం'కు చెందినవని అంటారు.
వేదాల ఆవిర్భావం నుండి హిందూమతం ఆచారాలు, సిద్ధాంతాలలో ఏర్పడిన స్పష్టత ఇప్పటికీ కొనసాగుతున్నది. వీటిలో అతి పురాతనమైన [[ఋగ్వేదం]] 1700–1100 BCE కాలానికి చెందినదని ఒక అభిప్రాయం. వేదాలలో ఇంద్రుడు, వరుణుడు,అగ్ని వంటి దేవతల ఆరాధన, సోమయాగం వంటి యజ్ఞకర్మలు బహుళంగా చెప్పబడ్డాయి. విగ్రహారాధన కంటే మంత్రారాధన, యజ్ఞకాండలు వేదసాహిత్యంలో ప్రాముఖ్యత వహిస్తాయి. ఋగ్వేదంలోని ఆచారాలు, విశ్వాసాలు [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్ మతాని]]కి కొంత సారూప్యం కలిగి ఉన్నాయి.
వేదాల తరువాతి కాలాన్ని పురాణాల కాలంగాపేర్కొంటారు. వీటిలో మొదటివైనరామాయణం,మహాభారతం 500–100BCE, కాలంలో రూపుదిద్దుకొన్నాయి. తరువాత అనేక పురాణాలు వెలువడ్డాయి. పురాణాలలోని వివిధ అంశాలు నేటి హిందూమతాచారాలు, వ్యవహారాలు, విశ్వాసాలకు ప్రధాన ప్రమాణాలు.
హిందూ మతాన్నీ, అందులోని నమ్మకాలనూ మౌలికంగా ప్రభావితం చేసి, క్రొత్త పరిణామాలకు దారితీసిన మూడు ముఖ్యాంశాలు - ఉపనిషత్తులు,జైన మతము, బౌద్ధ మతము వీటిలో వేదాల సాధికారతను, వర్ణ వ్యవస్థ బంధాన్ని అంగీకరించకుండా మోక్షము లేదా నిర్వాణం పొందడం గురించి చెప్పబడింది.[ఆధారం చూపాలి]. గౌతమ బుద్ధుడుమరింత ముందుకు వెళ్ళి ఆత్మ లేదా భగవంతుడు అన్న నమ్మకాలను ప్రశ్నించాడు. మౌర్యుల కాలంలో బౌద్ధం దేశమంతటా వర్ధిల్లింది (క్రీ.పూ 300 నుండి క్రీ.శ. 200 వరకు). తరువాత వివిధ వేదాంత దర్శనాలుఅనేక విధాల సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. వీటిలో క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి చార్వాకుని నాస్తిక వాదం కూడా ఒకటి. క్రమంగా మళ్ళీ బౌద్ధమతాన్ని అణగద్రొక్కి హిందూమతం క్రీ.పూ. 400 నుండి క్రీ.శ. 1000 కాలంలో బలపడింది.
క్రీ.శ. 7వ శతాబ్దంలో భారతదేశంలో అరబ్బు వర్తకుల ద్వారా ప్రవేశపెట్టబడిన ఇస్లాం మతం తరువాత ముస్లిం పాలనా సమయంలో దేశమంతటా విస్తరించింది. ఈ కాలంలో రెండు మతాల మధ్యా వివిధ స్థాయిలలో ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. అదే సమయంలో సహ జీవన విధానాలు కూడా అభివృద్ధి చెందాయి. తరువాతి కాలంలో రామానుజాచార్యులు,మధ్వాచార్యులు, చైతన్యుడు వంటి ప్రవక్తల బోధనల వల్ల హిందూమతంలో మరికొన్ని నూతన విధానాలు నెలకొన్నాయి.

No comments:

Post a Comment